ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిజోరాం 22వ గవర్నర్ గా కంభంపాటి హరిబాబు జూలై 19, సోమవారం నాడు ప్రమాణం స్వీకారం చేశారు. ఐజ్వాల్ లోని రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కంభంపాటి హరిబాబు చేత గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోతాన్ఖుమా ప్రమాణం చేయించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రమాణస్వీకార కార్యక్రమానికి కొద్దిమంది అతిధులనే ఆహ్వానించారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్తంగా, రాష్ట్ర మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరై కంభంపాటి హరిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ