చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను శుక్రవారం రాత్రి చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా డబ్బుల కోసం తనపై బెదిరింపులకు దిగుతున్నాడని, బ్లాక్ మెయిల్ చేశాడంటూ తీన్మార్ మల్లన్నపై మారుతీ జ్యోతిష్యాలయం వ్యవస్థాపకుడు లక్ష్మీకాంత శర్మ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అనంతరం ఇప్పటికే ఓసారి తీన్మార్ మల్లన్నను పోలీసులు విచారణ చేశారు. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తీన్మార్ మల్లన్నను మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మల్లన్నపై సైబర్ క్రైమ్ స్టేషన్ లో, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్ స్టేషన్ లో కూడా ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ