తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 228 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 28, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,81,072 కి చేరింది. కరోనా వలన మరొకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,024కి పెరిగింది. అలాగే మరో 185 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,73,589కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 110, మేడ్చల్ మల్కాజిగిరిలో 20, రంగారెడ్డిలో 19, సూర్యాపేటలో 11 నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరుకుంది. కాగా వీరిలో ఇప్పటికే 13 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో రిస్క్ కంట్రీస్ నుండి వచ్చిన వారిలో ముగ్గురికి, రిస్క్ కంట్రీస్ నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన మరో 13 మంది శాంపిల్స్ ను ఇప్పటికే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (డిసెంబర్ 28, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,95,95,984
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,81,072
- కొత్తగా నమోదైన కేసులు : 228
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,73,589
- కరోనా రికవరీ రేటు: 98.90%
- యాక్టీవ్ కేసులు: 3,459
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,024
- కరోనా మరణాల రేటు: 0.59%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ