తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ప్రశ్నోత్తరాలలో భాగంగా ఆరు ప్రశ్నలకు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం అరగంట పాటు జీరో అవర్ కొనసాగనుంది. అలాగే ఈ రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎలాంటి అవినీతికి చోటులేకుండా, ప్రభుత్వం సరికొత్తగా రూపొందించిన ఈ రెవెన్యూ చట్టంలో ఏఏ అంశాలు ఉన్నాయోనని ప్రజల్లో ఆసక్తి నెలకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu