బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నారు. ఆగస్టు 2, 2022 నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. ఆగస్టు 2న యాదాద్రి నుంచి మూడో విడత పాదయాత్ర చేపట్టి భద్రకాళీ దేవాలయం వరకు 20 రోజుల పాటుగా కొనసాగించనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి, పాదయాత్ర కమిటీతో బండి సంజయ్ సన్నాహక సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు.
ముందుగా బండి సంజయ్ ఆగస్టు 28, 20211న తొలిదశ పాదయాత్ర మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ఈ యాత్ర చేపడుతునట్లు తెలిపారు. అనంతరం అక్టోబరు 2, 2021న హుస్నాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభతో తొలిదశ పాదయాత్రను ముగించారు. ఇక రెండో విడత పాదయాత్రను ఏప్రిల్ 14 నుండి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నుంచి ప్రారంభించి మే 14న తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగనున్న బండి సంజయ్ పాదయాత్ర యొక్క మూడో విడత ఆగస్టు 2న ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజలతో మమేకమవుతూ, స్థానిక సమస్యలు తెలుసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY