జూలై 17, 18 తేదీల్లో సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి, దేవాలయ కమిటీ ఛైర్మన్ సూరిటి కామేశ్ మరియు సభ్యులు, దేవాలయ పూజారులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు.
మరోవైపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ (జూలై 17) నాడు తమ ఇంటికి భోజనానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ బుధవారం ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేత రామేశ్వర్ గౌడ్, పలువురు కార్పోరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY