తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈటల రాజేందర్ దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీపై ఉన్న కోపాన్ని సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగంపై చూపిస్తున్నారని, ఇది చాలా అన్యాయం అని అన్నారు. ధాన్యం సేకరణ అనేది ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ అని తెలిపారు. మీరు బాధ్యతగా వ్యవహరించకుండా, నెపం కేంద్రంపై వేసి తప్పించుకోవడం సరికాదని హితవు పలికారు. ధాన్యం కొనబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరించే విషయంలో ద్వంద్వ విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల ఎకరాల్లో పండిన ధాన్యాన్నే కొనలేకపోతోందని, అదే ఒకవేళ కోటి ఎకరాల్లో ధాన్యం పండిస్తే ఏం చేయగలుగుతుందని ప్రశ్నించారు. దీనికోసం ఒక ప్రణాళిక ప్రకారం పోవాలని, అంతేకానీ అసలు వారి వేయొద్దని రైతులకు సూచించటం పద్దతి కాదని పేర్కొన్నారు. కాగా ఈరోజు ఇదే విషయమై లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్రమంత్రి పీయూష్ మంత్రి గోయల్ తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమన్నారు. దీనిపై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అయితే ఈ అంశం గురించి చర్చించేందుకు గురువారం తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ