జనసేన అధినేత పవన్ కల్యాణ్తో మే 25, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇరువురూ సమావేశమయ్యారు. వీరి మధ్య సుమారు గంట పాటు సమావేశం కొనసాగినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ-జనసేన పార్టీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పోటీచేయాలనీ నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలోనూ కలిసి పనిచేసే భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కాగా ఈ భేటీకి ఎలాంటి రాజకీయ నేపధ్యం లేదని, కేవలం మర్యాద పూర్వకంగానే కలుసుకునట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu