హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఫలితంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు, మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరబోతుందని అన్నారు. బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూనే వస్తున్నామని ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. ఎన్ని చేసినా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని, డబ్బులతో తమ ఓట్లు కొనుగోలు చేయలేరని ప్రజలు చాటిచెప్పారన్నారు. హుజురాబాద్ ప్రజలకు, వీరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడని, ఈటల గెలుపు బీజేపీ గెలుపని, బీజేపీ గెలుపు ఈటల గెలుపని, ఎవరెన్ని మాట్లాడినా పట్టించుకోమని చెప్పారు. దళిత బంధు అమలు చేసినా ప్రజలు నమ్మడం లేదని, పేదలకు సేవ చేసిన పార్టీనే, విశ్వాసమున్న పార్టీనే ప్రజలు గెలిపిస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ