ప్రముఖ సినీనటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, నటుడు ప్రకాశ్ రాజ్, జీవితా రాజశేఖర్, ఏడిద శ్రీరామ్, బ్రహ్మాజీ సహా పలువురు నటులు, ఉత్తేజ్ సన్నిహితులు బసవతారకం ఆసుపత్రికి చేరుకొని ఉత్తేజ్ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే పద్మావతి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ