తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2021-22 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ రోజు (మార్చ్ 18,గురువారం) ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశమై గురువారం నాడు రాష్ట్ర శాసనసభకు సమర్పించబోయే 2021-22 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. శాసనసభలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ