తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని అన్నారు. వీరిలో 8 మంది రాష్ట్రంలో ప్రవేశించారని, మరొక వ్యక్తి పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని, అయితే ఆయన రాష్ట్రంలోకి ప్రవేశించలేదు అని చెప్పారు. కొత్తగా హన్మకొండ, చార్మినార్ లలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అని శ్రీనివాసరావు వివరించారు.
విదేశాల నుంచి వచ్చిన ఏడుగురితోపాటు హన్మకొండకు చెందిన ఒక మహిళకు కూడా ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్లు ఆయన చెప్పారు. కెన్యా, సోమాలియా, యూకే, సూడాన్, చెక్ రిపబ్లిక్ దేశాలనుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ వైరస్ గుర్తించినట్లు చెప్పారు. హన్మకొండకు చెందిన మహిళకు ఎనిమిది రోజుల తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. తరువాత జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఒమిక్రాన్ వేరియెంట్ గా నిర్ధారణ అయిందని ఆయన వివరించారు. ఇప్పటికే 90 దేశాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాపించింది. ఇప్పటి వరకు యూకేలో ఒక్కటి తప్ప ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. 95 శాతం కంటే ఎక్కువగా ఒమిక్రాన్ సోకిన వారిలో కూడా ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు. ఈ వేరియంట్ తో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ తో భయాందోళనలు అవసరం లేదు అని చెప్పారు.
ఈ రోజుకి తెలంగాణాలో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా వచ్చే ఛాన్స్ ఉందని.. వ్యాక్సిన్ వేసుకున్నామన్న నిర్లక్ష్యంతో వ్యవహరించొద్దని హెచ్చరించారు. తరచుగా శానిటైజ్ చేసుకోవటం, మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలని దీనివల్ల ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టొచ్చని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు మన దగ్గర సామాజిక వ్యాప్తి జరగలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ