తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఫిబ్రవరి 5, ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పై కేబినెట్ చర్చించి ఆమోదం తెలుపనున్నదని తెలిపారు. ఇక ఆదివారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ నాందేడ్ కు చేరుకొని, అక్కడ నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రెండవ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే (ఫిబ్రవరి 3, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, వెంటనే ఉభయ సభలను(శాసన సభ, శాసన మండలి) ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇక 2023-24 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 6 తేదీన శాసన సభ, శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE