తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి (ఫిబ్రవరి 3, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, వెంటనే ఉభయ సభలను(శాసన సభ, శాసన మండలి) ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇక 2023-24 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 6 తేదీన శాసన సభ, శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఫిబ్రవరి 5, ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది.
గవర్నర్ సమావేశం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించి, సభను ఎన్ని రోజులు నిర్వహించాలి?, సభలో ప్రవేశపెట్టే బిల్లులపై నిర్ణయంతో పాటుగా సమావేశాల పూర్తి ఎజెండాను ఖరారు చేయనున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశాల ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందస్తు సమావేశం నిర్వహించి, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశాల కోసం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE