ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (మే 30, ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వ్యవసాయం, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు, కరోనా, లాక్డౌన్ తదితర అంశాల మీద కేబినెట్ చర్చించనున్నట్టు తెలిపారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో లాక్డౌన్ మే 30 వరకు అమల్లో ఉండనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటితో లాక్డౌన్ గడువు ముగియనుండడంతో కేబినెట్ సమావేశంలో చర్చించి పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ప్రజల్లో లాక్డౌన్ పొడిగిస్తారా లేదా అనే అంశంపై చర్చ జరుగుతుండడంతో ఈ కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ