మాస్కులు తప్పకుండా ధరించండి, అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దు: మంత్రి ఈటల

Telangana Health Minister Etala Rajender about Corona Situation in the State

కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారికీ, ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే ఫ్రంట్ లైన్ లో పని చేసినటువంటి పోలీసులకు, పంచాయితీ రాజ్ శాఖ, మునిసిపల్ శాఖ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు.

మాస్కులు తప్పకుండా ధరించండి, అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దు:

45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగతుందని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా పీహెఛ్సీ స్థాయిలో ఎక్కువ టెస్టులు చేసి, ట్రీట్మెంట్ అందిస్తున్నామని తెలిపారు. పక్కనున్న మహారాష్ట్ర సహా, ఇతర రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. మాస్క్ లు తప్పకుండా ధరించాలి, అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దు అని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 17 =