దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,72,433 కేసులు, 1,008 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,18,03,318 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,98,983 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 2,59,107 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,97,70,414 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 95.14 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 15,33,921 (3.67%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఫిబ్రవరి 2 (8am)–ఫిబ్రవరి 3 (8am)):
- కేరళ – 52,199
- కర్ణాటక – 20,505
- మహారాష్ట్ర – 18,067
- తమిళనాడు – 14,013
- గుజరాత్ – 8,934
- రాజస్థాన్ – 8,428
- మధ్యప్రదేశ్ – 7,359
- ఆంధ్రప్రదేశ్ – 5,983
- ఉత్తర్ ప్రదేశ్ – 5,016
- ఒడిశా – 3,450
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ