భారత దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఒక్కరోజే కొత్తగా 776 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చెన్నై నగరంలోనే 567 కేసులు నమోదయినట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,967 కి చేరింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 95 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 400 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6282 కి చేరింది. ప్రస్తుతం 7,590 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu