తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చి 4, గురువారం నాడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటుగా ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం, కాటేజీల నిర్మాణాలు, కళ్యాణ కట్ట, పుష్కరిణీ ఘాట్లు, అన్నప్రసాదం కాంప్లెక్స్ తదితర నిర్మాణాల్లో పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నట్టు తెలుస్తుంది. ఆలయ నిర్మాణ పనుల పరిశీలన అనంతరం వైటీడీఏ, ఆలయ అధికారులు, ఇతర సంబంధిత సిబ్బందితో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి, తగిన సూచనలు చేసే అవకాశముంది. మరోవైపు యాదాద్రిలో సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటన అనంతరం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తంపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ