తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రస్తుతం దేశవ్యాప్త పర్యటన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మే 20, శుక్రవారం నాడు ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఇక రేపు (మే 22, ఆదివారం) మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి చంఢీఘర్ పర్యటనకు వెళ్లనున్నారు. చంఢీఘర్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.
అలాగే వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యాణా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులను అందచేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF