తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు వచ్చిన సీఎం కేసీఆర్ కు మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆలయ పండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిడ్ మానేరు డ్యామ్ పరిశీలన కోసం బయలుదేరారు. మిడ్ మానేరు డ్యామ్ సందర్శన తర్వాత కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం విరామ అనంతరం విలేకరులతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటుగా మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు.
[subscribe]