ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ ను నియమిస్తూ డిసెంబర్ 30, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయన్ను ఏపీఐఐసీ వైస్ఛైర్మన్, ఎండీ స్థానం నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీగా బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబుని రిలీవ్ చేశారు. మరోవైపు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రజత్భార్గవ్ కు ఏపీఐఐసీ వైస్ఛైర్మన్, ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
[subscribe]