ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1246 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 24, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,44,490 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 207, తూర్పుగోదావరిలో 167, నెల్లూరులో 158, కృష్ణాలో 138, ప్రకాశంలో 128, పశ్చిమగోదావరిలో 123, గుంటూరులో 117 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 1,450 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 10 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 14118 కి పెరిగింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 24, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 2,79,80,792
- గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 55,323
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 20,44,490
- కొత్తగా నమోదైన కేసులు : 1246
- కొత్తగా నమోదైన మరణాలు : 10
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 20,16,837
- యాక్టీవ్ కేసులు : 13,535
- మొత్తం మరణాల సంఖ్య : 14,118
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ