తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ మూడు, నాలుగు రోజులు పాటుగా ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో పాటుగా పలువురు కేంద్రమంత్రులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు, కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు, రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, గిరిజన రిజర్వేషన్లు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ