తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా సభలు నిర్వహించారు. ఈ క్రమంలో ఈ రోజు (సెప్టెంబర్ 17, శుక్రవారం) సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో జరగనున్న దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ గజ్వేల్ సభకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, జై కాంగ్రెస్ నినాదం వినిపించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సీఎం నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేయడంతో భారీ జనసమీకరణకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ