తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర ఎనిమిదో రోజుకు (సెప్టెంబర్ 4, శనివారం) చేరుకుంది. వికారాబాద్ లో జరుగుతున్న ఎనిమిదో రోజు పాదయాత్రలో బండి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. అలాగే శ్రీశైలం నుంచి విచ్చేసిన స్వామీజీలు బండి సంజయ్ కు ఆశీర్వచనం అందించారు. శనివారం నాడు మన్నెగూడ, శివారెడ్డి పేట, వికారాబాద్ టౌన్, కొత్తగడి మీదుగా మమదాన్ పల్లి వరకు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజలతో మమేకమవుతూ, స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ