తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 20 జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ శనివారం నాడు ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండతో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పాటించాల్సిన వ్యూహం, ప్రచారం, సన్నద్ధతపై పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ నవంబర్ 6 వ తేదీ వరకు కొనసాగనుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానాలకు పదవీకాలం ముగియడంతో త్వరలో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu