తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 258 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 22, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,164 కి పెరిగింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,908 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక బుధవారం నాడు 55,419 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 249 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,55,310 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,946 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (258):
- జీహెచ్ఎంసీ ఏరియా – 69
- కరీంనగర్ – 25
- రంగారెడ్డి – 21
- ఖమ్మం – 15
- మేడ్చల్ మల్కాజిగిరి – 13
- నల్గొండ – 12
- వరంగల్ అర్బన్ – 12
- జనగామ – 10
- మంచిర్యాల – 9
- పెద్దపల్లి – 8
- జగిత్యాల – 8
- వరంగల్ రూరల్ – 7
- సిద్దిపేట – 7
- మహబూబ్ నగర్ – 5
- సూర్యాపేట – 5
- మహబూబాబాద్ – 4
- భద్రాద్రి కొత్తగూడెం – 3
- నిజామాబాద్ – 3
- ములుగు – 3
- యాదాద్రి భువనగిరి – 3
- రాజన్న సిరిసిల్ల – 3
- ఆదిలాబాద్ – 2
- జోగులాంబ గద్వాల్ – 2
- సంగారెడ్డి – 2
- వనపర్తి – 2
- నాగర్ కర్నూల్ – 1
- కామారెడ్డి – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 1
- మెదక్ – 1
- నిర్మల్ – 1
- వికారాబాద్ – 0
- నారాయణ్ పేట్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ