తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 406 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 16, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,29,873 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,095 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి మరో 494 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,22,667 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 27,348 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (406):
- హైదరాబాద్ – 177
- మేడ్చల్ మల్కాజిగిరి – 32
- రంగారెడ్డి – 27
- నల్గొండ – 18
- యాదాద్రి భువనగిరి – 16
- మహబూబ్ నగర్ – 14
- పెద్దపల్లి – 13
- కరీంనగర్ – 11
- ఖమ్మం – 10
- మెదక్ – 9
- నిజామాబాద్ – 8
- రాజన్న సిరిసిల్ల – 7
- మంచిర్యాల – 6
- కామారెడ్డి – 6
- సిద్ధిపేట – 6
- జనగామ – 5
- జగిత్యాల – 5
- సంగారెడ్డి – 5
- సూర్యాపేట – 5
- హనుమకొండ – 5
- భద్రాద్రి కొత్తగూడెం – 3
- నాగర్ కర్నూల్ – 3
- వరంగల్ రూరల్ – 3
- మహబూబాబాద్ – 2
- జోగులాంబ గద్వాల్ – 2
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- జయశంకర్ భూపాలపల్లి – 2
- వికారాబాద్ – 2
- ఆదిలాబాద్ – 1
- వనపర్తి – 1
- నారాయణ్ పేట్ – 0
- ములుగు – 0
- నిర్మల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY