దేశంలో వరుసగా మూడోరోజూ కూడా 20 వేలకుపైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 20,408 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 30, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,00,138 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 5.05 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 54 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,26,074 కి పెరిగింది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 1,43,384 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.48 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,43,384 (0.33%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 20,958 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,33,30,442 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.48 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక జూలై 29, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 87.48 కోట్లకు (87,48,11,197) చేరుకుంది. జూలై 29న 4,04,399 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY