దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 10,929 పాజిటివ్ కేసులు, 392 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,44,683 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,60,265 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మిజోరాం, అస్సాం, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 12,509 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,37,37,468 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 1,46,950 (0.43%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (నవంబర్ 5 (8am)– నవంబర్ 6 (8am)):
- కేరళ – 6,580
- తమిళనాడు – 875
- మహారాష్ట్ర – 802
- వెస్ట్ బెంగాల్ – 763
- మిజోరాం – 513
- అస్సాం – 239
- కర్ణాటక – 214
- ఒడిశా – 170
- తెలంగాణ – 151
- ఆంధ్రప్రదేశ్ – 150
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ