తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2072 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 28, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,89,283 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1116 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 2259 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,58,690 కి చేరింది. ప్రస్తుతం 29,477 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 83.83 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 283, రంగారెడ్డిలో 161, మేడ్చల్ లో 160, నల్గొండలో 139, కరీంనగర్ లో 109, ఖమ్మంలో 92, వరంగల్ అర్బన్ లో 85, భద్రాద్రి కొత్తగూడెంలో 85, సిద్దిపేటలో 78, నిజామాబాద్ లో 72, సూర్యాపేటలో 72, మహబూబాబాద్ లో 60 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu