తెలంగాణ రాష్ట్రంలో మరో 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 499 కేసులతో కలిపి జూన్ 19, శుక్రవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6526 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు మొత్తం 2477 మందిని పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 198 కి పెరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా జీహెచ్ఎంసీ ఏరియాలో 329 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 129, జనగామలో 7, మహబూబ్ నగర్ లో 6, మేడ్చల్, మంచిర్యాల, వరంగల్ అర్బన్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలలో 4 కేసుల చొప్పున, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో 2 కేసుల చొప్పున, సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 449 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 51 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3352 కి చేరింది. ప్రస్తుతం 2,976 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu