రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ధరణి పోర్టల్లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ప్రతిరోజూ పెండెన్సీ స్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వాట్సాప్, ఈమెయిల్ లతో పాటు అందిన అన్ని ఫిర్యాదులపై స్పందించి, ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. భూ విషయాలకు సంబంధించిన మాడ్యూల్స్, ధరణి పోర్టల్ సహా ఇతర అంశాలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించారు. ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజి శేషాద్రి, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఐఆర్ఎస్ ఎండీ జి.టి వెంకటేశ్వర్ రావు, సి.సి.ఎల్.ఎ ప్రత్యేక అధికారి సత్య శారదా, తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ