యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

CS Somesh Kumar Visits Yadadri Lakshmi Narasimha Swamy Temple, Lakshmi Narasimha Swamy Temple, Mango News, Somesh Kumar, Somesh Kumar Visits Yadadri Lakshmi Narasimha Swamy Temple, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Visits Yadadri Lakshmi Narasimha Swamy Temple, yadadri, Yadadri Lakshmi Narasimha Swamy Temple, Yadadri Laxmi Narasimha Swamy

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం సీఎస్ సోమేశ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ బి.నర్సింహామూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకు ముందు సీఎస్ కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను సీఎస్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో ఎన్ గీత, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, తదితరులు వెంట ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 20 =