ఏపీ శాసనమండలి చైర్మన్ గా కొయ్యే మోషేన్రాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో మోషేన్రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చైర్ వద్దకు తీసుకొచ్చి, బాధ్యతలు స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా మోషేన్రాజుకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా అభినందనలు తెలియజేశారు.
ముందుగా శాసన మండలి చైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కొయ్యే మోషేన్రాజు గురువారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా ఎంఏ షరీఫ్ పదవీకాలం ముగియడంతో ఏపీ శాసన మండలి చైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజుకు మండలి చైర్మన్గా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. ఇక మండలి చైర్మన్ పదవికి మోషేన్ రాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం మండలి చైర్మన్ గా కొయ్యే మోషేన్రాజు బాధ్యతలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ