తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆగస్టు 12, శుక్రవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ విభాగం పరీక్షకు 1,56,860 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,26,140 మంది (80.41 శాతం), అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 80,575 మంది విద్యార్థులు హాజరుకాగా, 71,180 మంది (88.34 శాతం) మంది అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్ ఎంసెట్-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, ఆగస్టు 21 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
టీఎస్ ఎంసెట్-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్:
మొదటి విడత:
- ఆన్లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – ఆగస్టు 21 నుంచి ఆగస్టు 29 వరకు
- స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – ఆగస్టు 23 నుంచి ఆగస్టు 30 వరకు
- సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్ ఆప్షన్స్ పక్రియ – ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 2 వరకు
- మొదటి విడత సీట్లు కేటాయింపు – సెప్టెంబర్ 6
రెండో విడత:
- స్లాట్ బుకింగ్ – సెప్టెంబర్ 28, 29
- సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – సెప్టెంబర్ 30
- వెబ్ ఆప్షన్స్ పక్రియ – సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు
- రెండో విడత సీట్లు కేటాయింపు – అక్టోబర్ 4
మూడో విడత:
- స్లాట్ బుకింగ్ – అక్టోబర్ 11
- సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – అక్టోబర్ 13
- వెబ్ ఆప్షన్స్ పక్రియ – అక్టోబరు 11 నుంచి అక్టోబరు 14 వరకు
- మూడో విడత సీట్లు కేటాయింపు – అక్టోబరు 17
- అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల విధి విధానాలు వెల్లడి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY