తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 1న టీఎస్ ఈసెట్-2022 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసెట్-2022 ఫలితాలను శుక్రవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈసెట్-2022కు దాదాపుగా 24 వేల మంది దరఖాస్తు చేసుకోగా, దాంట్లో 22 వేల మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. అందులో 19,954 మంది అనగా 90.69 శాతం మంది ఉత్తీర్ణులయినట్టు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, పరీక్షలు నిర్వహించిన అధికారులకు మంత్రి అభినందనలు తెలియజేశారు.
ఇక పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ecet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సి మాథెమాటిక్స్ విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ /బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్ ప్రవేశాలు కల్పిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY