తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ లో పనిచేసే బోధనా, బోధనేతర సిబ్బందికి వేతనాలు పెంచింది. వీరికి కూడా ప్రభుత్వం ప్రకటించిన కొత్త 30 శాతం పీఆర్సీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నూతన పే స్కేల్ ను ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దాదాపు 3 వేల మంది మోడల్ స్కూల్స్ టీచర్లు, సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. కొత్త పీఆర్సీ ప్రకారం మోడల్ స్కూల్స్ లోని ప్రిన్సిపాల్స్ కు రూ.58,850-1,37,050, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (పీజీటీ) రూ.45,960-1,24,150, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (టీజీటీ) రూ.42,300-1,15,270 పే స్కేల్ అమలు కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ