ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2058 కరోనా పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జూలై 31, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,66,175 కు, మరణాల సంఖ్య 13377 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 2053 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,31,618 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(2058):
- తూర్పుగోదావరి – 364
- కృష్ణా – 325
- చిత్తూరు – 284
- ప్రకాశం – 242
- గుంటూరు – 182
- నెల్లూరు – 173
- కడప – 140
- పశ్చిమగోదావరి – 127
- విశాఖపట్నం – 89
- అనంతపూర్ – 47
- శ్రీకాకుళం – 45
- విజయనగరం – 29
- కర్నూల్ – 11
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ