తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (జనవరి 18, మంగళవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన ఈ జిల్లాల్లో పంట నష్టం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం పరిశీలించి, రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ