తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఛైర్మన్ల నియామకంపై మంగళవారం నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎనర్జీ డిపార్ట్మెంట్) చైర్మన్ గా వై సతీష్ రెడ్డి నియమించబడ్డారు. సతీష్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా కొనసాగుతున్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఐ అండ్ పీఆర్) డిపార్ట్మెంట్) చైర్మన్ గా అనిల్ కుమార్ కుర్మాచలం నియమించబడ్డారు. అనిల్ కుర్మాచలం ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ కు వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకేకు వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఈ కార్పొరేషన్స్ చైర్మన్ పదవుల్లో వీరిద్దరూ మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY