తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మన్గా జస్టిస్ గోపాల్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు మరియు ఫీజుల నియంత్రణ వంటి అంశాలపై ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రతి విద్యా సంవత్సరంలో ఈ కమిటీ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణపై పలు అధ్యయనాలు చేసి ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తుంది. ఈ కమిటీలో ఇతర సభ్యులుగా మరికొందరిని ప్రభుత్వం నియమించింది. అలాగే వీరితో పాటుగా ప్రభుత్వం తరఫున ఆర్థికశాఖ నుంచి, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆల్ ఇండియా కౌన్సెల్ ఆఫ్ టెక్నికల్ నుంచి ఒకరు, ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీని సభ్యులుగా నియమించింది.
తెలంగాణ ప్రభుత్వం నియమించిన టీఏఎఫ్ఆర్సీ సభ్యులు..
- టీఏఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ – జస్టిస్ గోపాల్రెడ్డి.
- ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ – జేఎన్టీయూ మెకానికల్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అకడమిక్ ఎక్స్పర్ట్.
- డాక్టర్ విమలా థామస్ – సిద్ధిపేట మెడికల్ కాలేజీ అకడమిక్ ఎక్స్పర్ట్.
- జీవీ లక్ష్మణ్రావు – చార్టర్డ్ అకౌంటెంట్-ఫైనాన్స్ ఎక్స్పర్ట్.
- పీ సుధీర్రెడ్డి – న్యాయవాది-లీగల్ ఎక్స్పర్ట్.
- ఓయూ వీసీ – ఇంజినీరింగ్ కోర్స్.
- నారాయణ హెల్త్ యూనివర్సిటీ వీసీ – మెడికల్ కోర్స్.
- ఎంజీ యూనివర్సిటీ వీసీ – బీఈడీ మరియు ఇతర కోర్సులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE