తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు శాసనసభలో ఈరోజు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023-24 బడ్జెట్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ, ఇది ప్రజల బడ్జెట్, ఇది రైతు ప్రభుత్వమని అన్నారు. వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు కేటాయింపులు చేయడం హర్షణీయమని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ సాగునీటి రంగానికి రూ.26,885 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
అలాగే ఆయిల్ పామ్ సాగుకు రూ.1000 కోట్లు ఇచ్చినందుకు ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. “రూ.2 లక్షల 90 వేల కోట్లలో రూ.53 వేల 700 కోట్లు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సాగునీటి రంగానికి కేటాయించడం గమనార్హం. 2014 నుండి ఇప్పటి వరకు వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.1,91,612 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికి ఆదర్శం” అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE