పల్లె ప్రకృతివనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

CS Somesh Kumar held Review with Collectors over Palle Prakruthi Vanalu and Telangana Sports Grounds,CS Somesh Kumar,Telangana CS Somesh Kumar,Somesh Kumar Review with Collectors,Palle Prakruthi Vanalu,Telangana Sports Grounds,Mango News,Mango News Telugu,Niranjan Reddy Releases Co-operative Dept Diary and Calendar,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లతో పల్లె ప్రకృతివనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లు, జివో నెం.58,59,76, రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులపై బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతివనాలలో మొక్కల సంరక్షణ కోసం పూర్తి స్ధాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ క్రీడా ప్రాంగణాల కోసం స్ధలం కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై జిల్లాల వారీగా సీఎస్ సమీక్షించారు. ముఖ్యంగా జివో నెం.58,59,76 లపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, జిఏడి కార్యదర్శి శేషాద్రి, సిసిఎల్ఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ, సిసిఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 7 =