తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శనివారం సందర్భంగా ఉండే సాధారణ సెలవును రేపు రద్దు చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సెలవుల రద్దు ఉత్తర్వులు వర్తించవని, కేవలం మూడు జిల్లాల పరిధిలోనే అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు ఈ నెల 12వ తేదీన యథావిధిగా నడుస్తాయని ఉత్తర్వుల్లో తెలిపారు. కాగా గత నెల 9వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోజుని సెలవుగా ప్రకటించింది. అయితే దానికి బదులుగా ఈ నెల 12న సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE