తెలంగాణ రాష్ట్రంలో మే 19 నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు మొదలైన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా మార్చ్ 22 నాడు నిలిచిపోయిన బస్సు సర్వీసులు, 57 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. కాగా హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా సిటీ బస్సులు నడిపేందుకు మాత్రం సీఎం కేసీఆర్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మే 23, శనివారం నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలో ప్రభుత్వం కార్యాలయాల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవడంతో ప్రభుత్వ ఉద్యోగులను వారి ఇళ్ల నుంచి కార్యాలయాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం శనివారం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేందుకు ఉద్యోగులు తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డు చూపించాలని స్పష్టం చేశారు. అలాగే నగర పరిధిలో మొత్తం 32 మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించినట్లు ఆయన వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]