ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ అందించింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగస్తులకు నియమిత ఉపచారాలు నిర్వహించుకోడానికి తేదీ ఏప్రిల్ 3, 2022 నుండి మే 2, 2022 వరకు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, బోర్డ్స్, పబ్లిక్ సెక్టార్, స్కూల్స్ లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు కార్యాలయాల నుండి లేదా స్కూల్స్ నుండి 4 గంటలకే విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ