తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక, జానపద కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజులూ సాధారణ ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
భారత స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకునేందుకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం నంది పలికింది. దీనిలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిత్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య సమర యోధులపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శన నగరంలోని ఎస్టీఆర్ స్టేడియంలో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతరానికి స్ఫూర్తిని అందించడం కోసం స్వాతంత్ర్య సమర వీరులు చేసిన త్యాగాలను పునరావలోకనం చేసుకోవడం దీని ప్రధానోద్దేశం. జాతీయ సాంస్కృతిక ఉత్సవం సాంప్రదాయ భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ