కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మళ్ళీ కరోనా వ్యాక్సినేషన్కు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు. 45 ఏళ్లు పైబడి కొవిన్ పోర్టల్లో ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు.
కాగా ప్రైవేట్ ఆసుపత్రులు సొంతంగానే వ్యాక్సిన్ తయారీసంస్థల నుంచే కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రభుత్వం సరఫరా చేయదని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ఏప్రిల్ 30న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. వారికీ వ్యాక్సిన్ డోసుల పంపిణీని కూడా నిలిపివేశారు. తాజాగా మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ